మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 మే 2016 (14:56 IST)

సుమిత్రా మహాజన్ ప్రాణాలకు ముప్పు.. రూ.48 లక్షలతో జాక్వార్ కారు

లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. అదీ కూడా ఆమె సొంత డబ్బులతో కాదు.. ప్రభుత్వ నిధులతో. ఈ కారు ధర రూ.48.25 లక్షలు. అత్యంత విలాసంగా ఉండే జాగ్వార్ ఎక్స్ఈ మోడల్‌ను ఆమె ఎంపిక చేసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లోక్‌సభ స్పీకర్‌కు అంత విలాసవంతమైన కారు ఎందుకంటూ ప్రశ్నించింది. అంతేనా ప్రజా ధనాన్ని మోడీ సర్కారు దుర్వినియోగం చేస్తోందంటూ ఆరోపణలు గుప్పించింది. 
 
దీనిపై లోక్‌సభ వర్గాలు స్పందించాయి. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని జాగ్వార్ కారును కొనుగోలు చేసినట్లు వివరణ ఇచ్చాయి. సుమారు 4-5 కార్ల గురించి సమీక్షించామని, అయితే అందులో భద్రతా కారణాల దృష్ట్యా జాగ్వార్‌ను కొన్నట్లు లోకసభ కార్యదర్శి డి.భల్లా తెలిపారు. సెక్యూరిటీ అధికారులు ఇచ్చిన సలహా మేరకే జాగ్వార్‌ను కొనుగోలు చేసినట్టు చెప్పుకొచ్చారు.