శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జులై 2015 (12:33 IST)

సుప్రీంకు కొత్త సవాల్: డాక్టర్ల అనుమతితో సర్జరీ ద్వారా అబార్షన్‌కు ఓకే!!

దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఓ కేసు సవాలుగా మారింది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్ సుప్రీం కోర్టుకు తలనొప్పిగా మారింది. 14 సంవత్సరాల తన కుమార్తె గర్భవతి అని, ఆమెకు అబార్షన్ చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతించాలని పిటిషన్‌లో కోరాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఏఆర్ డావె, కురియన్ జోసఫ్‌ల బెంచ్, చట్టానికి వ్యతిరేకంగా వెళ్తేనే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డప్పటికీ, అందుకు సమ్మతిని మాత్రం చెప్పలేదు.
 
ప్రెగ్నెన్సీ చట్టం నిబంధనల ప్రకారం 20 వారాల లోపు గర్భవతులకే అబార్షన్ చేయవచ్చు. కానీ బాధితురాలు 24 వారాల గర్భవతిగా ఉండడం, దీనికితోడు ఆమె వయసు 14 సంవత్సరాలే కావడంతో, ఏం చేయాలో పాలుపోని స్థితిలో ధర్మాసనం తలపట్టుకుంది. 
 
దీంతో చేసేది లేక కేసును ప్రత్యేక డాక్టర్ల బృందానికి అప్పగించింది. ఆమెకు సర్జరీ చేయడం ద్వారా గర్భాన్ని తొలగించవచ్చా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని, అందుకు అనుమతి లభిస్తుందా? అని గైనకాలజిస్టులు, క్లినికల్ సైకాలజిస్టుల బృందాన్ని ప్రశ్నించింది.
 
కాగా, అంతకుముందు ఇదే కేసులో వాదనలు విన్న గుజరాత్ హైకోర్టు అబార్షన్ చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు జూలై 23న నిరాకరించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును మైనర్ బాధితురాలి తండ్రి కామినీ జైస్వాల్ సుప్రీంలో సవాలు చేయగా, ఇద్దరు సీనియర్ డాక్టర్లకు బాలికను పరీక్షించాలని ఆదేశించింది. ప్రాణాపాయం లేకుండా గర్భం తొలగించవచ్చని డాక్టర్లు భావిస్తే, గర్భవిచ్ఛితికి ఆదేశాలిస్తామని కూడా సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది.