గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (17:33 IST)

బ్రేకింగ్ న్యూస్.. జల్లికట్టు చట్టంపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నో: తమిళ ప్రజలకు మరో విన్

తమిళులు వారం రోజుల పాటు జరిపిన జల్లికట్టు ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ విడుదల చేయడంపై తమిళనాడు సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయిత

తమిళులు వారం రోజుల పాటు జరిపిన జల్లికట్టు ఆందోళనలపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. జల్లికట్టుపై ఆర్డినెన్స్ విడుదల చేయడంపై తమిళనాడు సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే కొత్త చట్టం గురించి ఆరు వారాల్లోగా తమకు వివరాలు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.

అయితే జల్లికట్టు' నిషేధంపై పోరాటం చేసి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారా కొత్త చట్టం తీసుకువచ్చిన తమిళ ప్రజలకు మరో విజయం వరించింది. 2016 నోటిఫికేషన్‌ను కేంద్రం వెనక్కు తీసుకునేందుకు కూడా సుప్రీంకోర్టు అనుమతించింది.
 
సుప్రీం కోర్టు నుంచి ఈ కొత్త చట్టానికి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. జల్లికట్టు చట్టంపై 'స్టే' ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం మంగళవారంనాడు నిరాకరించింది. అలాగే దీనిపై మద్రాసు హైకోర్టుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అలాగే, జల్లికట్టు నిరసనల సమయంలో శాంతి భద్రతల పరిస్థితులను సక్రమంగా పట్టించుకోలేదంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం మందలించింది. 
 
ఇదిలా ఉంటే.. జల్లికట్టు ఉద్యమం సమయంలో విధ్వంసానికి పాల్పడినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలేదిలేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌ సెల్వం స్పష్టం చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్‌ సహా పలు జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాయుత ఘటనల్లో నిందితులను గుర్తించి, శిక్షిస్తామని చెప్పారు. నాటి హింసాకాండపై దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు.