శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (11:31 IST)

గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ!

ఓబుళాపురం మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 
 
అదేసమయంలో ఈ కేసు దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, మూడు నెలల తర్వాత బెయిల్ కోసం గాలి జనార్ధన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేసుకోవచ్చని సలహా ఇచ్చింది. అయితే, గాలి కేసుల విచారణను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని దిగువ కోర్టును సుప్రీం ఆదేశించింది. ప్రస్తుతం ఆయన రిమాండులో ఉంటున్న సంగతి తెలిసిందే.