శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Ashok
Last Updated : శుక్రవారం, 2 జూన్ 2017 (12:23 IST)

నా బిడ్డ హత్యను సినిమాగా నిర్మించవద్దు: స్వాతి తండ్రి గోపాలకృష్ణన్

గతేడాది జూన్‌ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్వాతి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. అయ

గతేడాది జూన్‌ 24న చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్వాతి దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో రామ్‌కుమార్‌ అనే వ్యక్తిని నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. అయితే పోలీస్‌ కస్టడీలో ఉండగా రామ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ హత్య దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. అలాగే స్వాతి పై పలు అనుమానాలు కూడా వచ్చాయి.
 
ఇప్పుడు ఆ సంఘటనపై తమిళంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తన కూతురి హత్యను సినిమాగా నిర్మించవద్దని స్వాతి తండ్రి సంతన గోపాల కృష్ణన్‌ పోలీసులను ఆశ్రయించారు. సినిమా కోసం తమ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అంతేగాక, ఈ ఘటనను తెరకెక్కిస్తే వాస్తవానికి వ్యతిరేకంగా తీసే అవకాశాలున్నాయని గోపాల కృష్ణన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
ఈ హత్యను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రమేశ్‌ సెల్వన్‌ ‘స్వాతి కొలై వళక్కు’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్‌, పోస్టర్లను కూడా చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో స్వాతి పాత్రలో ఆయిరా నటిస్తోంది. నిందితుడు రాంకుమార్‌ పాత్రలో మనో అనే కొత్త నటుడిని పరిచయం చేస్తున్నారు.