బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (19:45 IST)

శశిని సీఎం చేస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని అమ్మేస్తుంది : టి రాజేందర్

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను నియమిస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని అమ్మేస్తుందని సినీ నటుడు, లక్ష్య ద్రావిడ మున్నేట్ర కళగ అధ్యక్షుడు టి రాజేందర్ ఆరోపించారు. ప్రస్తుతం తమిళనాడులో

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్‌ను నియమిస్తే మన్నార్గుడి మాఫియా రాష్ట్రాన్ని అమ్మేస్తుందని సినీ నటుడు, లక్ష్య ద్రావిడ మున్నేట్ర కళగ అధ్యక్షుడు టి రాజేందర్ ఆరోపించారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఆయన గురువారం స్పందిస్తూ... శశికళ సీఎం అయితే తమిళనాడును అమ్మేస్తారంటూ ఆరోపించారు. 
 
మన్నార్గుడి మాఫియాలాగే శశికళ ప్రవర్తిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను. పార్టీ కార్యకర్తలను ఆమె బెదిరిస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమెకు అవకాశమొస్తే ఆఖరికి ప్రధాని మోడీని కూడా బెదిరించే రకమన్నారు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా ఎందుకు రిలీజ్ చేయలేదని శశికళను ప్రశ్నించారు.
 
కాగా, తమిళనాట రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. శశికళ సీఎం కావడాన్ని సీనియర్ నేతలు మొదలుకుని సినీ నటులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి వారిలో కమల్ హాసన్, అరవింద్ స్వామి, ఖుష్బూ, ఆర్య తదితరులు ఉండగా, తాజాగా టి.రాజేందర్ కూడా చేరారు.