శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (15:38 IST)

మంచి సీటును ఏర్పాటు చేస్తే సభకు వస్తా : పన్నీర్ సెల్వంకు కరుణానిధి!

డీఎంకే అధినేత అసెంబ్లీ సమావేశాలకు సక్రమంగా రావడం లేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఒ పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలపై ట్రిప్లికేణి - చెప్పాకం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అయిన కరుణానిధి స్పందించారు. తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సీటు సౌకర్యం ఏర్పాటు చేస్తే అసెంబ్లీ సమావేశాలు హాజరయ్యేందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. 
 
ఇదే అంశంపై డీఎంకే పార్టీ పత్రిక మురసొలిలో ఆయన ఒక ఆర్టికల్‌ను రాశారు. సభలో మెరుగైన సీటింగ్ అమరిక ఏర్పాటు చేస్తే, తాను సభకు వస్తానని చెప్పారు. సరైన సీటింగ్ అమరిక లేకుండా తాను సభకు హాజరుకాలేనని 2013లో ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి సమాచారం అందించానని, ఈ ఏడాది కూడా సర్కారుకు తెలిపానని గుర్తు చేశారు. అయినాగానీ, సర్కారు తన ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.