శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2019 (15:36 IST)

ప్రేమలో ఉన్నపుడు ముద్దూ ముచ్చట్లతో ఫోటోలు .. పెళ్లయ్యాక భర్తకు పంపిన ప్రియుడు

ఓ వివాహిత చిక్కుల్లో పడింది. పెళ్లికి ముందు ఓ యువకుడుతో ప్రేమలో పడింది. ఆ సమయంలో తన ప్రియుడుతో సన్నిహితంగా ఉన్నపుడు కలిసి ఫోటోలు దిగింది. ఇపుడు ఈ ఫోటోలే ఆమె దాంపత్య జీవితానికి చిక్కులు తెచ్చిపెట్టాయి. పెళ్లి తర్వాత కూడా తనతో శారీకక సంబంధం పట్టుకోవాలని ప్రియుడు ఒత్తిడి చేయగా, ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. దీంతో ప్రియుడు బ్లాక్ మెయిల్‌కు దిగాడు. తాము ప్రేమలో ఉన్నపుడు కలిసి దిగిన ఫోటోలను ఆమె భర్తకు పంపించాడు. వీటిని చూసిన కట్టుకున్న భర్త ఖంగుతిన్నాడు. 
 
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరువణ్ణామలై జిల్లా కీళ్ పెన్నాత్తూరు గ్రామానికి చెందిన వీరమణి అనే యువకుడు గ్రామాల్లో తిరుగుతూ సిల్వర్ పాత్రలను విక్రయిస్తూ ఉపాధిపొందుతున్నాడు. ఈ యువకుడికి ఆ గ్రామానికి చెందిన అదే ప్రాంతానికి చెందిన 20 యేళ్ల యువతిని ప్రేమించాడు. ఆ తర్వాత వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఈ క్రమంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు దిగారు. 
 
ఆ తర్వాత ఆ యువతికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. దీన్ని జీర్ణించుకోలేని యువకుడు.. పెళ్లి తర్వాత కూడా శారీరక సంబంధం కొనసాగించాలని కోరగా, ఆమె అందుకు నిరాకరించింది. దీంతో గతంలో తామిద్దరం కలిసి దిగిన ఫోటోలను ఆ యువతి భర్తకకు పంపించాడు. ఈ  ఫోటోలను చూసిన ఆమె భర్త... కాపురం చేసేది లేదని తెగేసి చెప్పాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించగా వీరమణిని అదుపులోకి తీసుకుంది. కేసును నమోదు చేసి విచారిస్తున్నారు.