మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 జనవరి 2017 (15:02 IST)

స్నానం చేస్తున్న బాలికపై అత్యాచారం.. బాత్రూమ్‌లోకి దూరి.. ఆపై పరార్..

బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు జరిగే ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఓ బాలిక స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి దూరిన కామాంధుడు బాలికపై అత్యాచారాన

బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాలికలపై అత్యాచారాలు జరిగే ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. రాజస్థాన్‌లో ఓ బాలిక స్నానం చేస్తుండగా బాత్రూమ్‌లోకి దూరిన కామాంధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రంలోని బరాన్ జిల్లా చబ్దా పట్టణంలో ఆదివారం నాడు ఓ ఇంట్లో 15ఏళ్ల బాలిక స్నానం చేయడం కోసం బాత్రూమ్‌లోకి వెళ్లింది.
 
బాలిక కదలికలను గమనిస్తున్న మహేంద్ర బైరాగీ(28) అనే స్థానిక యువకుడు ఉన్నట్టుండి బాత్రూమ్‌‍లోకి చొచ్చుకుపోయాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డి అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత బాలిక తన తల్లితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, పోస్కో చట్టాల కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతనిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.