శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 ఆగస్టు 2014 (16:11 IST)

దళిత బాలికపై అత్యాచారం: చెరకు తోటలోకి లాక్కెళ్లి!

దళిత బాలికపై యువడొకడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గడ్డికోసుకురావడానికి పొలానికి వెళ్లిన 15 ఏళ్ల బాలికపై దుండగుడు ఈ అకృత్యానికి ఒడిగట్టాడు. యూపీలోని పార్థాపూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
నిందితుడు సోనుపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బాలికను బలవంతంగా చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
 
ఇంటికి తిరిగొచ్చిన బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణయిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.