మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (09:07 IST)

దెయ్యాలను వదిలిన బూత్ బంగళా ఇచ్చారు : లాలూ తనయుడు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టార

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు, బీహర్ రాష్ట్ర మాజీ మంత్రి తేజ్‌ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బూతు బంగళా కేటాయించి, అందులో దెయ్యాలను వదిలిపెట్టారనీ, అందుకే ఆ బంగళాను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. 
 
తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా ఉన్నప్పుడు దేశ్‌రత్న్‌ మార్గ్‌లోని భవనాన్ని కేటాయించారు. ఆది నుంచి వాస్తు, మతపరమైన విషయాలపై గట్టి నమ్మకం ఉన్న తేజ్‌ ఆ బంగ్లాను తన సెంటిమెంట్‌గా భావించారు. అప్పట్లో ఈ బంగ్లా ప్రధాన ద్వారం మూసేసి, పలు మార్పులు కూడా చేయించారు. 
 
కానీ మంత్రి పదవి నుంచి దిగిపోయాక ఆ భవనాన్ని ఖాళీ చేయాలని తేజ్‌ప్రతా్‌పకు నితీశ్‌ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అయినా బంగ్లాను ఖాళీ చేయని తేజ్‌.. పాట్నా హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ నోటీసులపై స్టే విధించింది. 
 
ఈ నేపథ్యంలో, ఆకస్మికంగా ఆయన ఆ బంగళాను ఖాళీ చేశారు. 'సీఎం నితీశ్‌కుమార్‌, ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ నా ఇంట్లో దెయ్యాలను వదిలారు. అవి నన్ను వేధిస్తున్నాయి. అందుకే బంగ్లా ఖాళీ చేయాల్సి వచ్చింది' అంటూ ఆయన ట్వీట్ చేశారు.