జార్ఖండ్ లోయలో బస్సు బోల్తా.. పది మంది దుర్మరణం..!
జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జార్ఖండ్లోని గార్వా సమీపంలో ప్రయాణీకులతో వెళుతున్న ఓ బస్సు లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోగా, 25 మందికి పైగా గాయాలపాలయ్యారు.
బీహార్లోని ససరాం నుంచి చత్తీస్గఢ్లోని రాయగఢ్కు ప్రయాణీకులతో ఓ బస్సు బయలుదేరింది. ఈ బస్సు సోమవారం ఉదయం 5గంటల ప్రాంతంలో జార్ఖండ్లోని గార్వా - అంబికాపూర్ ప్రాంతంలోని కొండ ప్రాంతంలో వెళుతుండగా అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.