గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 జులై 2017 (10:53 IST)

ఆయన జేసీ దివాకర్ రెడ్డి.. విమానం ఎక్కనీయొద్దు :: వెనుదిరిగిన టీడీపీ ఎంపీ!

అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొలి దెబ్బ తగిలింది. వైజాగ్ విమానాశ్రయంలో చేసిన హడావుడి పర్యావసనాన్ని ఆయన ఎదుర్కొన్నారు. జేసీని విమానం ఎక్కనీయకుండా విమాన సిబ్బంది

అధికార టీడీపీకి చెందిన సీనియర్ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తొలి దెబ్బ తగిలింది. వైజాగ్ విమానాశ్రయంలో చేసిన హడావుడి పర్యావసనాన్ని ఆయన ఎదుర్కొన్నారు. జేసీని విమానం ఎక్కనీయకుండా విమాన సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో చేసేదేం లేక వెనుదిరిగారు. ఆదివారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది. 
 
ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆదివారం ఉదయం 6:40 గంటలకు విజయవాడ వెళ్లే ట్రూ జెట్ విమానంలో ప్రయాణించేందుకు ఆయన టికెట్ బుక్ చేసుకోగా, "మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేము" అని ట్రూ జెట్ సిబ్బంది స్పష్టం చేశారు.
 
దీంతో చేసేదేమీ లేక జేసీ వెనుదిరిగారు. ఇటీవల విశాఖపట్నంలో ఆయన విమానాశ్రయ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జేసీపై పలు విమానయాన సంస్థలు నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఘటన జరిగిన రోజు విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు చొరవతో విమానం ఎక్కినా, ఆ తర్వాత జేసీ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కలేకపోవడం ఇదే తొలిసారి.