గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (14:30 IST)

ఆర్కే.నగర్ బైపోల్ : దినకరన్ ఆస్తులు రూ.77 కోట్లు... మధుసూదనన్ ఆస్తుల విలువ రూ.4 కోట్లు

చెన్నై, ఆర్కే.నగర్ ఉపఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం సాయంత్రంతో నామినేషన్ దాఖలు ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి అధికార అన్నాడీఎంకేతో పాటు డీఎంకే, డీఎండీకే, బీజేపీ, స

చెన్నై, ఆర్కే.నగర్ ఉపఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం సాయంత్రంతో నామినేషన్ దాఖలు ఘట్టం ముగిసింది. ఈ ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి అధికార అన్నాడీఎంకేతో పాటు డీఎంకే, డీఎండీకే, బీజేపీ, సీపీఎంలతో పాటు చిన్నాచితక పార్టీల అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు పోటీపడుతున్నారు. 
 
అయితే, ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో వారి ఆస్తుల వివరాలను వెల్లడించారు. ఇందులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున పోటీ చేస్తున్న శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ మొత్తం ఆస్తుల విలువ రూ.77.96 కోట్లుగా ప్రకటించారు. 
 
అలాగే, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వర్గం తరపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఇ.మధుసూదనన్ ఆస్తుల విలువ రూ.4.97 కోట్లుగా ఉంది. ఇకపోతే ప్రధాన విపక్షమైన డీఎంకే తరపున మరుద గణేష్ పోటీ చేస్తుండగా, ఆయన ఆస్తుల విలువ కేవలం 9.88 లక్షలు మాత్రమే. 
 
సినీ నటుడు విజయకాంత్ సాథ్యంలోని డీఎండీకే తరపున మదివాణన్ పోటీ చేస్తుండగా ఆయన ఆస్తుల విలువ రూ.40.69 లక్షలుగా ఉంది. సీపీఎం అభ్యర్థి లోగనాథన్ ఆస్తుల విలువ రూ.6.05 లక్షలుగా ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే, బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంగై అమరన్, జయలలిత మేనకోడల జయదీప ఆస్తుల వివరాలను మాత్రం బహిర్గతం కాలేదు.