నైజీరియాలో ఇద్దరు విశాఖవాసులు కిడ్నాప్...
నైజీరియాలో ఇద్దరు విశాఖ వాసుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంజినీర్ సాయి శ్రీనివాస్తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టు కుటుంబానికి సమాచారం అందింది. సాయి శ్రీనివాస్ జీబొకో నగరంలో డంగోటే కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అక్కడి ప్రభుత్వానికి డం
నైజీరియాలో ఇద్దరు విశాఖ వాసుల కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఇంజినీర్ సాయి శ్రీనివాస్తో పాటు మరో వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టు కుటుంబానికి సమాచారం అందింది. సాయి శ్రీనివాస్ జీబొకో నగరంలో డంగోటే కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. అక్కడి ప్రభుత్వానికి డంగోటే సిమెంట్ కంపెనీ సమాచారమిచ్చింది.
దీనితో అప్రమత్తమైన అధికారులు విశాఖ వాసులను కిడ్నాప్ చేసిన వారికోసం గాలిస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు కిడ్నాప్ చేసింది ఎవరు.. ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయం తెలియాల్సి ఉంది.