గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 జులై 2014 (14:39 IST)

ఇద్దరు తెలుగు ఇంజినీర్లను కిడ్నాప్ చేసిన బోడో తీవ్రవాదులు?

అస్సాంలో ఇద్దరు తెలుగు ఇంజినీర్లు కిడ్నాప్‌కు గురయ్యారు. వీరిని బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేసివుంటారని నుమానిస్తున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన ముగ్గురు ఇంజినీర్లు రఘు, ప్రకాష్, చంద్ర.. రత్న కన్స్‌స్ట్రక్చర్‌లో పనిచేశారు. 
 
కాగా, సొంత రాష్ట్రానికి వచ్చేందుకు స్థానిక రైల్వే స్టేషన్‌కు వచ్చిన వీరిని బోడో తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరిలో ఒకరు తీవ్రవాదుల బారి నుంచి తప్పించుకుని బయటపడ్డారు. మంగళవారం కిడ్నాప్ విషయాన్ని బాధితులు పని చేస్తున్న కంపెనీ ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమవారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా విడిపించాలని విజ్ఞిప్తి చేశారు.