శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (16:16 IST)

చాక్లెట్లు అనుకుని ఎలుకల మందు తినేసిన చిన్నారుల మృతి.. ఆటోలో..

ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబం

ఆ చిన్నారులు ఆ ఎలుకల మందుతో కూడిన చిన్నపాటి కేకులను చాక్లెట్లో లేదా బర్ఫీలు అనుకున్నారో ఏమో కానీ.. ఎలుకల మందును ఆహార పదార్థంగా భావించి తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌ బరాబంకీలోని ఇస్లాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన దివ్యాంశ్(2), హృదేశ్(2)లు మంగళవారం తమ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆటోలో ఆడుకునేందుకు వెళ్లారు. ఆటోలో వారికి ఎలుకల మందు కనిపించింది. దానిని తినే పదార్థంగా భావించిన వారిద్దరూ తినేశారు.
 
కానీ ఆపై వాంతులు చేసుకుని ఆస్పత్రి పాలయ్యారు. అయితే అప్పటికీ పరిస్థితి విషమించడంతో బుధవారం ఆ చిన్నారులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.