గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (18:07 IST)

రేపిస్టులకు తలకిందులుగా వేలాడదీసి.. చితకబాది.. దెబ్బలపై కారం పూయాలి: ఉమాభారతి

తరచూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తాజాగా అత్యాచార దోషులపై విరుచుకుపడ్డారు. సర్జికల్‌ దాడులపై అనుమానాలు వ్యక్తంచేసిన వారిని వెళ్లి పాకిస్థాన్‌ పౌరసత్వం తీసుకోమని గతం

తరచూ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి తాజాగా అత్యాచార దోషులపై విరుచుకుపడ్డారు. సర్జికల్‌ దాడులపై అనుమానాలు వ్యక్తంచేసిన వారిని వెళ్లి పాకిస్థాన్‌ పౌరసత్వం తీసుకోమని గతంలో వ్యాఖ్యానించిన ఉమాభారతి.. అత్యాచారాలకు పాల్పడిన వారికి చుక్కలు చూపించాలన్నారు. 
 
అత్యాచారాలకు పాల్పడిన వారు తమను బతకనివ్వమని వేడుకోవాలి.. అలాంటి వారిని తలకిందులుగా వేలాడదీసి చితకబాది వారి దెబ్బలపై కారం పూయాలి. వాళ్లు గట్టి గట్టిగా ఏడుస్తుంటే.. అరుస్తుంటే బాధిత మహిళలు చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేపిస్ట్‌ల భరతం పట్టానని ఉమాభారతి తెలిపారు. రేపిస్టులను హింసించి, క్షమించమని బాధితుల కాళ్లు పట్టుకునేలా చేశానన్నారు.
 
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ప్రచార సభలో మాట్లాడుతూ.. బాధితుల ముందు రేపిస్టుల భరతం పట్టాలి. దిక్కులేక వాళ్లు క్షమించమని బాధితుల కాళ్ల మీద పడాలి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగే చేయించాను' అని పేర్కొన్నారు. తాను గతంలో పోలీసులకు అలాగే చేయమని చెప్పానని వెల్లడించారు.