గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (15:05 IST)

పగలంతా పూజారి.. రాత్రి అయితే బైకుల్ని దోచేస్తాడు... ఢిల్లీలో కొత్త దొంగ దొరికాడోచ్..

పగలంతా పూజారిగా కనిపిస్తాడు. రాత్రి అయితే చైన్ స్నాచర్‌గా మారిపోయే ఓ కొత్త దొంగ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని ద్వారక వాసి రామ్ కుమార్ ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తుంటాడు. ఢిల్లీ

పగలంతా పూజారిగా కనిపిస్తాడు. రాత్రి అయితే చైన్ స్నాచర్‌గా మారిపోయే ఓ కొత్త దొంగ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని ద్వారక వాసి రామ్ కుమార్ ఓ ఆలయంలో పూజారిగా పనిచేస్తుంటాడు. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల పలు దేవాలయాల్లో ఆయన పూజలు చేస్తుంటాడు. ఉదయం పూట దేవాలయాల్లో పూజారిగా విధులు నిర్వహిస్తుంటారు. రాత్రి వేళలలో స్నేహితుడితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. 
 
ఇప్పటిదాకా రామ్ కుమార్ 8 బైకులను దొంగలించాడు. ఇటీవల బైకుపై అనుమానాస్పదంగా వెళ్ళే రామ్ కుమార్‌ను ఆతడి స్నేహితుడు హరీష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం జరిపిన దర్యాప్తులో రామ్ కుమార్ దొంగని తేలింది. మెట్రో స్టేషన్ల వద్ద బైకులను దొంగలించి విక్రయిస్తానని రామ్ కుమార్ ఆతడి స్నేహితులు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. ఇలా దొంగలించిన బైకులను రూ.5వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తామని రామ్ కుమార్ తెలిపాడు.