శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:16 IST)

అబ్బెబ్బే... మాకెలాంటి సంబంధం లేదు : టీఎన్ పాలిట్రిక్స్‌పై రాజ్‌నాథ్

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆయన స్పంది

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో తలెత్తిన సంక్షోభానికి తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ఆయన స్పందిస్తూ.. అన్నాడీఎంకేలో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఆ పార్టీలో త‌లెత్తిన సంక్షోభంతో తమకెలాంటి సంబంధం లేదు. 
 
అన్నాడీఎంకే జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ శశికళ నటరాజన్, త‌మిళ‌నాడు ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వం మధ్య పోరు న‌డ‌వ‌డం అన్నాడీఎంకే అంత‌ర్గ‌త విష‌య‌మ‌న్నారు. తమిళనాడు రాజకీయాలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం గ‌వ‌ర్న‌రే నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఆయ‌న చెప్పారు. ఇదే విధంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే.