గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (11:47 IST)

యోగి ఆదిత్యనాథ్ అదుర్స్.. ఇక యూపీలో 24 గంటల పాటు విద్యుత్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇక 24 గంటల విద్యుత్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు యూపీ మాత్రమే అందరికీ 24 గంటల విద్యుత్ పథకంలోకి రాలేదు. ఇప్పుడు యోగి నేతృత్వంలో యూపీ కూడా చేరింది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్ప

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇక 24 గంటల విద్యుత్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు యూపీ మాత్రమే అందరికీ 24 గంటల విద్యుత్ పథకంలోకి రాలేదు. ఇప్పుడు యోగి నేతృత్వంలో యూపీ కూడా చేరింది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధికి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న యోగి ఆదిత్యనాథ్.. శుక్రవారం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో యూపీలో కూడా అందరికీ 24గంటల విద్యుత్ అమల్లోకి వచ్చింది.
 
యోగి కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం యూపీ సర్కారు 1911 అనే హెల్ప్ లైన్ నెంబర్‌ను కూడా ఏర్పాటు చేసింది. యూపీ పవర్ ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.331.69కోట్లతో 8 సబ్ స్టేషన్లను, 75.60కోట్లతో మరో 12సబ్ స్టేషన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. 
 
ఇకపోతే.. ఏప్రిల్ 11న జరిగిన రెండో కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్.. గ్రామాల్లో 18గంటలు, పట్టణాల్లో 20గంటల విద్యుత్ అందించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. 2019 వరకు యూపీలోని ప్రతీ గ్రామానికి విద్యుత్ అందించాలనే తమ లక్ష్యంతో కేంద్రంతో కుదుర్చుకున్న అందరికీ విద్యుత్‌తో చేరుకుంటుందని తెలిపారు.