గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (16:46 IST)

ప్రియురాళ్ల గుట్టు విప్పిందని భార్యను హత్య చేసిన బిస్కెట్ కింగ్ సన్!

తన ప్రియురాలితో పాటు అనేక మంది యువతులతో తనకున్న వావాహేతర, అక్రమ సంబంధాల గురించి కుటుంబ సభ్యుల ముందు బహిర్గతం చేసిన తన భార్యను ఓ భర్త 14 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడింది ఎవరో కాదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిస్కట్ కింగ్ ఓం ప్రకాష్ దాసాని తనయుడు. ఈ హత్య కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశాయి. 
 
పియూష్ దాసాని భయంకరమైన స్త్రీలోలుడని పోలీసులు వెల్లడించారు. పెళ్లయిన తర్వాత పక్కింట్లో ఉండే పాన్ మసాలా కంపెనీ యజమాని కుమార్తె మనీషా మఖీజాను ముగ్గులోకి దింపడమే కాకుండా పలువురు యువతులతో అక్రమ సంబంధాలు జరిపినట్టు వెల్లడించారు. 
 
ఇందుకు సంబంధించి పియూష్ దాసాని మొబైల్ ఫోన్ కాల్ లిస్టును బహిర్గతం చేశారు. గత రెండు నెలల కాలంలో మనీషా మఖీజాకు 663 సార్లు ఫోన్ చేయగా, తమ కంపెనీలో పని చేసే మరో యువతికి 330 సార్లు ఫోన్ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. 
 
ఇలాంటి ఫోన్ కాల్స్ చాలా ఉన్నాయట. అది పక్కన పెడితే తన ప్రియురాలితో నిత్యం మాట్లాడేందుకు, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మనీషా మఖీజాకు ఐదు సిమ్ కార్డులు నకిలీ అడ్రస్‌లతో తీసినట్టు తేలింది. 
 
ఈ విషయాలన్నీ తెలుసుకున్న భార్య జ్యోతి దాసాని వాటిని అడ్డుకోవడమే కాకుండా, తన భర్త రాసలీలలను కుటుంబ సభ్యుల ముందు బట్టబయలు చేసింది. ఈ కోపంతో భార్యను ప్రియురాలి డ్రైవర్, అతడి స్నేహితుడి సాయంతో కసిదీరా 14 సార్లు పొడిచి చంపినట్టు తేలింది. ఈ కేసుపై విచారణ సాగుతోంది.