శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (11:48 IST)

ఐస్‌క్రీమ్ అడిగినంత ఇవ్వలేదు.. పెళ్లొద్దుకుని వెళ్ళిపోయిన వరుడు.. ఎక్కడ?

పీటల మీద పెళ్లిళ్లు చాలా వరకు కట్నం ఇవ్వలేదనో, ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థల వల్లనో, చివరి నిముషంలో వరుడు కానీ, వధువు తమకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పడం మూలంగానో ఇతరత్రా కారణాల వల్ల ఆగిపోతుంటాయి. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ ఓ పెళ్లి మాత్రం ఓ విచిత్ర కారణం వల్ల ఆగిపోయింది. ఆ విషయం తెలిస్తే మాత్రం మీరు నవ్వుకోవడం ఖాయం. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథురలోని ఓ ప్రాంతంలో వధువు ఇంటివద్ద పెళ్లి బంధుమిత్రుల సందడితో అంగరంగ వైభవంగా జరుగుతుంది. పెళ్ళికొడుకు తరపు బంధువులు విందారగిస్తున్నారు. ఉన్నట్టుండి మగపెళ్లివారికి తరపు నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఐస్ క్రీం గురించి గొడవపెట్టుకున్నారు. వాళ్లు అడిగినంత ఐస్‌క్రీం లేదని గొడవ పడ్డారు. 
 
చిన్నగొడవ కాస్త పెను తుఫానులా మారింది. ఇరు కుటుంబాల వారు మేమేన్న తక్కువా అంటూ తిట్టిపోసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి నచ్చచెప్పేందుకు రంగంలోకి దిగారు. కానీ వారి ప్రయత్నం విఫలమైంది. గొడవపడింది సరిపోదన్నట్టుగా ఆడపెళ్లివారు, మగపెళ్లివారు పోలీసులపై రాళ్ల దాడి చేసి వారిని తరిమి తరిమి కొట్టారు. తర్వాత వివాహాన్ని రద్దు చేసుకుని మగపెళ్లివారు వారి దారిన అక్కడి నుంచి వెళ్లిపోయారు.