గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (15:06 IST)

ఉత్తరప్రదేశ్‌లో దారుణం: 60 యేళ్ల మహిళ మర్మావయవంలో కారం పోసి కొట్టారు!!

కన్న కుమారుడి ప్రేమ వ్యవహారం ఓ తల్లి పరువు తీసింది. తన కుమారుడు ఓ యువతిని ప్రేమించి వెళ్లిపోయాడనే కారణంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ఆ తల్లికి నరకయాతన చూపించారు. తల్లి వయస్సుకి కూడా గౌరవం ఇవ్వకుండా అందరూ చూస్తుండగా ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చి బట్టలూడదీసి కొట్టి చిత్రహింసలు పెట్టారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే.. ఆ గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎవరికీ తెలియకుండా పారిపోయారు. దీంతో ఆగ్రహింతిన యువతి కుటుంబ సభ్యులు, బంధువులు యువకుడి ఇంటిపై దాడిచేశారు. 60 యేళ్ల వయసున్న అతడి తల్లిని బయటకు లాగి తీవ్రంగా కొట్టడంతో పాటు బట్టలూడదీసి చితకబాదారు. అంతటితో ఆగకుండా ముఖంపై, చెప్పరాని చోట్ల కారం పోసి మరీ చితక్కొట్టారు. తన భార్యకు సహాయం చేయాల్సిందిగా ఆమె భర్త గ్రామస్తులను బ్రతిమాలుకున్నా ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాలేదు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు హుఠాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని దుశ్చర్యను అడ్డుకున్నారు. దీంతో బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేయగా నింధితులు పరారీలో ఉన్నారు. వీరిలో నలుగురు మహిళలే కావడం గమనార్హం.