బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 13 జూన్ 2017 (10:16 IST)

ప్రియుడితో ఛాటింగ్.. భర్త కనిపెట్టేశాడని.. కొడవలితో దాడి చేసి.. జంప్ అయ్యింది..

వావి వరుసలు మంట కలిసిపోతున్నాయి. మానవీయ విలువలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ప్రియుడితో తనకున్న సంబంధాలను కనిపెట్టేసిన భార్య భర్తపైనే దాడికి ఒడిగట్టింది. అంతటితో ఆగకుండా.. ప్రియుడితో జక్కేసింది. ఈ ఘట

వావి వరుసలు మంట కలిసిపోతున్నాయి. మానవీయ విలువలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. ప్రియుడితో తనకున్న సంబంధాలను కనిపెట్టేసిన భార్య భర్తపైనే దాడికి ఒడిగట్టింది. అంతటితో ఆగకుండా.. ప్రియుడితో జక్కేసింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఖేరాఘర్‌లోని భిలావలి గ్రామానికి చెందిన నేత్రాపాల్‌కు 2014లో నీతూసింగ్ అనే మహిళతో వివాహం జరిగింది. 
 
వివాహం జరిగిన కొన్ని రోజులకే తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం వుందని, అతడినే ప్రేమిస్తోందని నేత్రాపాల్‌కు తెలిసింది. దీంతో వారిద్దరూ విడిపోయి దూరంగా ఉంటున్నారు. ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు నీతూసింగ్‌ తన భర్త ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో వాట్సాప్‌లో నీతూ ప్రియుడితో ఛాట్ చేస్తుండగా నేత్రాపాల్ చూశాడు. దీంతో ఆమెను ఫోన్ ఇవ్వాలని కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది.
 
దీంతో ఆమె నుంచి బలవంతంగా ఫోనును లాగేసుకుని ప్రియుడితో ఆమె సంభాషణ మొత్తం చూసేశాడు. ఫోన్ లాక్కుని ఛాట్ సంభాషణ చూసేయడంతో ఆగ్రహానికి గురైన నీతూ ఇంట్లోని కొడవలితో అతని తలపై బలంగా కొట్టింది. వెంటనే అతను గట్టిగా అరుస్తూ ఇంట్లో కుప్పకూలిపోయాడు. దీంతో బంధువులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ హడావుడిలో నీతూ తప్పించుకుని, ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటనలో గాయపడిన నేత్రాపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు.