శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 28 డిశెంబరు 2016 (16:18 IST)

రామ్మోహన్ రావూ... జాగ్రత్త, ఇలా మాట్లాడితే ఇంకా... వెంకయ్య హెచ్చరిక

తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడకూడదన్నారు. ప్రభుత్వం తనను పదవి నుంచి తొలగించలేదనీ, ఇంకా తనే సీఎస్ అంటూ మోహన్ రావు వ్యాఖ్యాని

తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడకూడదన్నారు. ప్రభుత్వం తనను పదవి నుంచి తొలగించలేదనీ, ఇంకా తనే సీఎస్ అంటూ మోహన్ రావు వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను తను పత్రికల్లో చూశానన్న వెంకయ్య, ఆయన కాస్త జాగ్రత్త వ్యవహరించడం మంచిదన్నారు. 
 
తమిళనాడు ప్రభుత్వ పరిపాలన, రాజకీయ సమస్యలు ఏమయినా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కేంద్రం దృష్టికి తెస్తారనీ, ఆ పరిస్థితేమీ లేనపుడు రామ్మోహన్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారనీ, ఇటువంటి సమయంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారుతుందని హెచ్చరించారు.