శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 27 నవంబరు 2014 (13:00 IST)

కాలం చెల్లిన వాహనాలు ఢిల్లీ రోడ్లపై తిరగడానికి వీల్లేదు : గ్రీన్ కోర్టు

డీజిల్, పెట్రోల్‌తో నడిచే కాలం చెల్లిన వాహనాలు దేశ రాజధాని ఢిల్లీ నగర రోడ్లపై తిరగడానికి వీల్లేదని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఒక వాహనం కొనుగోలు చేసిన తర్వాత 15 యేళ్లు మించిన ఏ ఒక్క వాహనం రోడ్లపై తిరగడానికి వీల్లేదని పేర్కొంది. 
 
నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఛైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. దేశ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ప్రతిరోజు ప్రశ్నార్థకంగా, మరింత అధ్వానంగా మారిందని ఆదేశాల్లో పేర్కొంది. ఈ క్రమంలో చట్ట ప్రకారం సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని, కాలం దాటిన వాహనాలను గుర్తించి సీజ్ చేసే విధంగా చూడాలని కోరింది.