శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PY REDDY
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (14:31 IST)

ఢిల్లీ వెలిగి పోతుంది.. రెండేళ్ళలో ఏళ్ళలో ఎల్ ఈ డీ దీపాలు : వెంకయ్య నాయుడు

విద్యుత్ ఆదాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పద్దతులను ప్రవేశపెడుతోందనీ, అందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో రెండు సంవత్సరాల్లోగా ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఢిల్లీలోని నారాయణ విహార్ లో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య పాల్గొని మాట్లాడుతూ, రెండో దశలో భాగంగా మెట్రో సిటీలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. 
 
తరువాత దేశమంతటా కూడా ఎల్ఈడీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు.  వీధి దీపాల్లో ఎల్ ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంవల్ల 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు.  మోదీ ప్రధాని కావడాన్ని కొంతమంది జీర్ణించుకోలేక పోతున్నారని ఆరోపించారు. అందుకే వారు అర్థపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు.