బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (15:32 IST)

ఇక్కడి తిండి తింటూ పాక్‌ను పొగిడే వాళ్లను చెప్పుతో కొట్టి..

భారత్‌లో ఉంటూ పాకిస్థాన్‌ను పొగిడేవాళ్లని చెప్పుతో కొట్టాలని విశ్వ హిందూ పరిషత్‌ నేత సాధ్వి బాలికా సరస్వతి అన్నారు. అలా మాట్లాడేవారిని అక్కడికే తరిమికొట్టాలన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బాలిక సరస్వతీ ఈ మంగుళూరులో హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో ముఖ్యవక్తగా వచ్చి ప్రసంగించారు. ఈ దేశంలో ఉండి ఇక్కడి తిండి తింటూ పరాయిదేశం పాక్‌ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టి తరిమేయాలన్నారు.
 
భారత్‌లో ఉంటూ, ఇక్కడ పండుతున్న తిండి తింటూ పరాయి దేశాన్ని పొగిడేవాళ్లను కొట్టి తరమాలని ఉద్బోధించారు. ఇటువంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించరాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో శ్రీరాముడికి గుడి కట్టాలని, ఇస్లామాబాదులో కూడా రామమందిరం నిర్మించి అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. మనమంతా ఆయుధాలు పట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.