''నీవు లేకుండా బతకలేను తల్లీ అన్నా..'' కనికరించని బిడ్డ.. ప్రేమ కోసం వెళ్ళిపోయింది..!
సోషల్ మీడియా ప్రభావంతో చాటింగ్లు డేటింగ్లు అంటూ నేటి యువత పెడదారిన పోతున్న సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొందరు మోసపోతుంటే.. మరికొందరు ప్రేమకోసం తల్లిదండ్రులను కూడా వద్దనుకుంటున్నారు. తాజాగా అలాంటి
సోషల్ మీడియా ప్రభావంతో చాటింగ్లు డేటింగ్లు అంటూ నేటి యువత పెడదారిన పోతున్న సంగతి తెలిసిందే. ప్రేమ పేరుతో కొందరు మోసపోతుంటే.. మరికొందరు ప్రేమకోసం తల్లిదండ్రులను కూడా వద్దనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన గంగరబోయిన మౌనిక అనే యువతి.. కాంపెల్లి గ్రామానికి చెందిన గంగరబోయిన రవీందర్ కూతురు మౌనిక జూన్ 25న ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. కూతురు కోసం బంధువుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో వెతికిన రవీందర్ ఈ నెల 5న సీరోలు పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు.
మౌనిక కోసం పోలీసులు విచారణ చేపట్టగా, మౌనిక అదే గ్రామానికి చెందిన కొండ విజయ్ అనే యువకునితో ఈ నెల 8న హైదరాబాద్లోని సీతాఫల్మండి ఆర్య సమాజ్లో ప్రేమపెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు ఈ విషయాన్ని మౌనిక తండ్రి రవీందర్కు చెప్పారు. ప్రేమ పెళ్ళికి రవీందర్ దంపతులు ఒప్పుకోలేదు. అయితే మౌనిక మాత్రం తాను మేజర్నని, తన ఇష్టం మేరకే పెళ్లి చేసుకున్నానని చెప్పింది.
"నీవు లేకుండా నేను బతకలేను తల్లీ.. నిన్ను పై చదువులు చదివించాలనుకున్నానమ్మా" అంటూ ఎంత బతిమాలినా.. మౌనిక మాత్రం ప్రేమ కోసం తల్లిదండ్రులను వదులుకుంటానని తెగేసి చెప్పేసింది. దీంతో ఆ కన్నతండ్రులు తలదించుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు. ఈ ఘటన పోలీసులనే కంటతడి పెట్టించింది.