శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (16:00 IST)

బాలికపై సామూహిక అత్యాచారం.. నలుగురు మైనర్లు అరెస్టు..!

సభ్యసమాజం తలదించుకు రీతిలో మరో దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై నలుగురు మైనర్ల బాలులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జల్పాయ్ గురి జిల్లాలోని కరాల నది వద్ద చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈ దారుణ సంఘటనకు పాల్పడిన నలుగురిని పోలీసు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం నలుగురు మైనర్లు ఆ బాలికను బలవంతంగా మూతబడిన పిల్లల పార్కులోకి తీసుకెళ్లి అనంతరం మత్తుపదార్థాలు కలిపిన ఆహార పదార్థాలను ఇచ్చారు. 
 
బాలిక మత్తులోకి జారుకుంటుండగానే సామూహికంగా అత్యాచారానికి పాల్పడి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. స్కూలుకు వెళ్లిన బాలిక ఎంత సేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాలించగా సోమవారం కరాల నది వద్ద ఉన్న పాడుబడ్డ పార్కులో అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. 
 
దీంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం స్పృహలోకి వచ్చిన ఆ బాలిక, జరిగిన ఘటన గురించి తల్లిదండ్రులకు, పోలీసులకు వివరించింది. బాధితురాలు గుర్తించిన నలుగురుని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివరాలతో సహా కోర్టు ముందు హాజరుపర్చారు. 
 
విచారించిన కోర్టు వారిని జువెనైల్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రబీంద్రనాథన్ వెల్లడించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.