శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (10:29 IST)

షీనాను ఎవరు చంపారు.. మీ లక్ష్యం ఏంటి.. పీటర్ ముఖర్జియాకు ప్రశ్నలు...

షీనా బోరా హత్య కేసులోని మిస్టరీని చేధించేందుకు ముంబై పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా భారత మీడియా టైకూన్, స్టార్ ఇండియా మాజీ సీఈఓ పీటర్ ముఖర్జియా వద్ద సుదీర్ఘ విచారణ జరిపారు. బుధవారం వర్లీలోని సొంత నివాసం నుంచి ఖర్ పోలీసు స్టేషన్‌కు ఉదయం 10.30 గంటలకు వచ్చిన పీటర్ వద్ద 9 గంటల సుదీర్ఘ విచారణ జరిపారు. ఆ సమయంలో పోలీసులు పలు రకాలైన ప్రశ్నలు కురిపించారు. 
 
ముఖ్యంగా ఇంద్రాణికి, ఆమె పిల్లలు షీనా, మైఖేల్‌కు ఎలాంటి సంబంధాలు ఉండేవిని ప్రశ్నించారు. అలాగే, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు ఇంద్రాణికి, మీకు (పీటర్) మధ్య సంబంధాలు ఉండేవా అని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఈ సందర్భంగా 25 ప్రశ్నలతో కూడిన ఓ ప్రశ్నపత్రావళిని కూడా పీటర్‌కు పోలీసులు అందజేసి సమాధానాలు రాబట్టారు. అలాగే, గురువారం కూడా ఆయన వద్ద విచారణ జరుపుతామని వెల్లడించారు. 
 
ముఖ్యంగా షీనా - రాహుల్ నిశ్చితార్థంపై మీ అభిప్రాయం ఏంటి అని పీటర్‌ను ప్రశ్నించారు. అసలు షీనా బోరాను హత్య చేసింది ఎవరని భావిస్తున్నారు. ఈ హత్య వెనుక లక్ష్యమేంటి, షీనా కనిపించకుండా పోయిన తర్వాత ఎందుకు మౌనంగా ఉండిపోయారు వంటి ప్రశ్నలు సంధించారు. వీటన్నింటికీ పీటర్ ముఖర్జియా సావధానంగా సమాధానమిచ్చినట్టు సమాచారం.