గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 22 మే 2015 (12:00 IST)

మంత్రగత్తె చెప్పింది...! తల్లిదండ్రులు పాటించారు..!! రెండు రోజుల చిన్నారికి నడక

దేవుడు చెప్పాడు.. అరుణాచలం పాటించాడు..ఈ డైలాగ్ రజనీకాంత్ చెబుతుంటే ఈలలు, కేకలు మార్మోగిపోతాయి. అయితే ఆ తరువాత అది ఎంతటి నిజమో ఎవరికి తెలుసు..? అది సినిమా కాబట్టి తెలుసుకునే అవకాశం ఉండదు. కానీ ఆ మంత్రగత్తె ఒక్క మాట చెప్పిందంటే గ్రామాలకు గ్రామాలు పాటిస్తాయి. ఒక్క అడుగు కూడా పక్కకు వేయరు. అది ప్రమాదమని తెలిసినా సరే ఏ మాత్రం వెనుకాడరు. మంత్రిగత్తె చెప్పిందని తల్లిదండ్రులు తమ రెండు రోజుల కొడును మెడపట్టుకుని నడిపించారంటే ఇంతకంటే మూఢనమ్మకాలు ఏముంటాయనిపిస్తుంది. మరింత జ్వరంతో పుట్టిన బిడ్డ ఆసుపత్రిపాలయ్యాడు. అస్సాంలోని ఓ మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
అస్సాంలోని మోరిగాన్ గ్రామంలో ఆ బాలుడికి తీవ్రమైన జ్వరం వస్తుండడంతో తలిదండ్రులు ఓ మంత్రగత్తెను ఆశ్రయించారు. బాలుడిని పరీక్షించిన తరువాత జ్వరం తగ్గాలంటే ఇలా బలవంతంగా, బట్టలు లేకుండా నడిపించాలని ఆ మంత్రగత్తె చెప్పిందట. ఇక ఆ మంత్రగత్తె చెప్పిందే ఆలస్యంగా నిరక్షరాస్యులు, మూఢాచారాలను నమ్మే ఆ పేరెంట్స్ అలాగే చేశారు. 
 
తల్లిదండ్రులు పిల్లాడికి బట్టలు తీసేసి మెడపట్టుకుని నడిపించారు. దీంతో పిల్లాడికి జ్వరం మరింత ఎక్కువైంది. జరిగిన ఈ ఘటనను ఎవరో మొబైల్‌లో చిత్రీకరించి పోలీసులకు పంపారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ గ్రామానికి చేరుకుని ఆ మంత్రగత్తెను అరెస్టు చేసి శిశువును ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆ చిన్నారి కోలుకుంటున్నాడు.