శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 ఏప్రియల్ 2016 (14:21 IST)

భర్త శవం కోసం ఆస్పత్రిలో వాగ్వాదానికి దిగిన భార్యలు!

భర్త శవం కోసం ఇద్దరు భార్యలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో కలకలం చెలరేగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిం. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చెన్నై, తిరువొట్రియూరు, రాజాజీ నగర్‌కు చెందిన గోవిందరాజ్‌ (45) అనే కిరాణా వ్యాపారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య అనితకు ఇద్దరు పిల్లలున్నా రు. ఆమెతో ఏర్పడిన విభేధాల కారణంగా గోవిందరాజ్‌ అమ్ము అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టారు. 
 
గత పదేళ్ళుగా రెండో భార్యా, పిల్లలతో గడుపుతూ వచ్చిన గోవిందరాజ్.. శనివారం సాయంత్రం హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో ఆయనను ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు గోవింద రాజ్‌ను పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ సమాచారం తెలిసి మృతుడి భార్యలు ఆసుపత్రికి చేరుకున్నారు. 
 
మృత దేహాన్ని తమకే అప్పచెప్పాలని వారు వాగ్వాదానికి దిగారు. ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేగడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని శాంతపరచారు. చివరకు మొదటి భార్య సమ్మతించడంతో మృతదేహాన్ని రెండవ భార్య అమ్ముకు అప్పగించారు.