శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 12 నవంబరు 2020 (18:54 IST)

అన్న విదేశాల్లో, తమ్ముడు వదినతో బెడ్రూంలో, కొత్త పెళ్లికూతురు షాక్

డబ్బు మోజులో ఆ భర్త విదేశీ బాట పట్టాడు. భార్యను ఇక్కడే వదిలేసి వెళ్లిన అతడు ఏడాదికి ఓసారి వచ్చి భార్యాపిల్లలకు గిఫ్టులు ఇచ్చి వారం తర్వాత తిరిగి వెళ్తుంటాడు. గత ఎనిమిదేళ్లుగా ఇదే తంతు. డబ్బు కోసం భర్త తిరిగి వెళ్లిపోతుండేవాడు. ఇక్కడ భార్య తన ఇద్దరు పిల్లలతో వుంటుండేది. ఆమెతో పాటు మరిది కూడా వుంటున్నాడు.
 
ఐతే అన్నయ్య దూరంగా వుండటంతో వొదినను లొంగదీసుకున్నాడు. ఇలా జరుగుతుండగానే తమ్ముడికి పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లయ్యాక అత్తారింటికి వచ్చిన కొత్త పెళ్లికూతురికి కొద్దిరోజుల్లోనే నిజం తెలిసి షాక్ తిన్నది. తను కట్టుకున్న భర్త, వొదినతో పడకగదిలో అసభ్యకరంగా కనిపించడంతో ఆమె గుండె పగిలింది. ఇదేమిటని ప్రశ్నించినందుకు ఆమెని వేధించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
 
ఈ దారుణం తమిళనాడులోని శివగంగై జిల్లా నన్నిపూర్‌లో జరిగింది. భాగ్యరాజ్ అనే యువకుడు కౌసల్య అనే యువతికి గత జులై నెలలో పెళ్లి చేసారు. పెళ్లయ్యాక లాక్ డౌన్ కారణంగా సెప్టెంబరు వరకూ పుట్టింట్లోనే వుండిపోయింది. సెప్టెంబరు నెలలో అత్తింటికి వచ్చింది. వచ్చిన కొన్ని రోజుల్లోనే తన భర్తకి, అతడి వొదినతో అక్రమ సంబంధం వుందన్న విషయాన్ని కళ్లారా చూసింది. ఆ విషయాన్ని ప్రశ్నించినందుకు ఆమెను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. వాటిని భరించలేని నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వొదిన, మరిది ఇద్దర్నీ అరెస్టు చేసారు.