శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జులై 2016 (11:26 IST)

ఉద్యోగం పేరుతో హోటల్‌కు రప్పించి మహిళపై అత్యాచారం!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ మహిళను హోటల్‌కు పిలిపించిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ మహిళను హోటల్‌కు పిలిపించిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
మధుర నగరంలోని ఓ హోటల్‌లో శ్యాంసుందర్ కర్ధం, గోపిచంద్‌లనే ఇద్దరు వ్యక్తులు తమ పరిశ్రమలో ఉద్యోగమిస్తామని చెప్పి 35 ఏళ్ల ఓ మహిళను హోటల్‌కు రప్పించి అత్యాచారం జరిపారని డీఎస్పీ పీయూష్ కుమార్ చెప్పారు. బాధిత మహిళ హర్యానాలోని ఫరీదాబాద్ అని. ఆమె బ్యూటీపార్లర్ నిర్వహించేదని డీఎస్పీ పేర్కొన్నారు. 
 
మహిళ ఫిర్యాదు మేర ఐపీసీ 376 కింద కొత్వాలీ పోలీసుస్టేషనులో కేసు నమోదు చేశామన్నారు. కాగా అత్యాచారం కేసులో నిందితుడైన శ్యాంసుందర్ కర్ధం మాజీ బీఎస్పీ నాయకుడని పోలీసులు తెలిపారు. నిందితుడు 2014 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేశారని పోలీసులు వివరించారు.