శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2017 (11:19 IST)

స్నేహితులని నమ్మి పబ్‌కెళితే.. మద్యం తాపించి గ్యాంగ్ రేప్ చేశారు... ఎక్కడ?

బెంగుళూరులో మరో సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితులని నమ్మి పబ్‌కు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

బెంగుళూరులో మరో సామూహిక అత్యాచారం జరిగింది. స్నేహితులని నమ్మి పబ్‌కు వెళితే ముగ్గురు కామాంధులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమ బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల మహిళ భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత బెంగుళూరుకు ఉపాధి నిమిత్తం వచ్చింది. ఆరు నెలలుగా తన స్నేహితురాలితో కలిసి ఉద్యోగవేట కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు రాకేష్, రాజేష్, నరసింహమూర్తి అనే ప్రైవేట్ ఉద్యోగులు పరిచయమయ్యారు. వీరు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. 
 
దీంతో వారితో తరచూ మాట్లాడుతూ వచ్చింది. ఈ క్రమంలో వారిని నమ్మి ఓసారి పార్టీకి వెళ్లింది. అనంతరం ఫ్రెండ్స్‌తోపార్టీ అంటూ ఆ పార్టీలో దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌ పేజ్‌లో పోస్టు చేసింది. తొలిసారి పార్టీలో బుద్ధిగా ఉండటంతో... మరోసారి మార్చి 26న ఆమెను కోరమంగళంలోని ఒక పబ్‌కు పార్టీ అంటూ తీసుకెళ్లారు. 
 
అనంతరం తిరుగు ప్రయాణంలో కారులో బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డుపై ఆపి, మద్యం తాగి, గ్యాంగ్ రేప్ చేశారంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.