గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 జూన్ 2016 (14:52 IST)

నీతో సహజీవనం చేస్తూనే.. నీ పెద్ద కుమార్తెను కూడా పెళ్లాడుతా!.. కాదన్నందుకు నలుగుర్నీ కాటికి పంపాడు!

భర్తను వదిలి తన ముగ్గురు కుమార్తెలతో ఒంటరిగా నివశిస్తున్న ఓ అభాగ్యురాలిని వ్యక్తి నమ్మించి గొంతుకోశాడు. వివాహితతో శారీరక సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూతురు వరుసయ్యే పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలని ఆ మహిళతో వాగ్వాదానికి దిగ

భర్తను వదిలి తన ముగ్గురు కుమార్తెలతో ఒంటరిగా నివశిస్తున్న ఓ అభాగ్యురాలిని వ్యక్తి నమ్మించి గొంతుకోశాడు. వివాహితతో శారీరక సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కూతురు వరుసయ్యే పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలని ఆ మహిళతో వాగ్వాదానికి దిగాడు. కాదన్నందుకు ఆమెతో సహా ముగ్గురు కుమార్తెలను దారుణంగా ఇనుప రాడ్డుతో తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత ఏం తెలియనట్టుగా ఇంటికి తాళాలు వేసి పారిపోయాడు. ఒకే ఇంట్లో జరిగిన ఈ నాలుగు హత్య కేసులో తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చెన్నై రాయపేట, ముత్తు నగర్‌కు చెందిన చిన్నరాజ్ (36) అనే వ్యక్తి బ్రహ్మచారి. స్థానికంగా ఉండే ఓ స్వీట్ షాపులో పని చేస్తూ అదే ప్రాంతంలో నివశించే పాండియమ్మాళ్ (38) అనే మహిళతో పరిచయం పెంచుకున్నాడు. భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈమె తన ముగ్గురు కుమార్తెలైన పవిత్ర (19), పరిమళ (18), స్నేహ (16)లతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. 
 
ఈ క్రమంలో భర్తలేకుండా జీవిస్తున్న పాండియమ్మాళ్‌కు చిన్నరాజ్ దగ్గరయ్యాడు. వారితోనే ఉంటూ వారి ఆలనాపాలనా చూస్తూ వచ్చాడు. చిన్నరాజ్ పర్యవేక్షణలోనే ఈ ముగ్గురు యువతులు విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో చిన్నరాజ్‌ను కూడా తమ ఇంట్లోనే ఉంచుకోవడంతో పాండియమ్మాళ్‌తో సహజీవనం చేస్తూ వచ్చాడు. అయితే, తాగుడు అలవాటు ఉన్న చిన్నరాజ్‌కు పెద్ద కుమార్తె పవిత్రపై కన్నుపడింది. ఆ యువతిని ఇచ్చి పెళ్లి చేయాలని పాండియమ్మాళ్‌పై ఒత్తిడి చేయసాగాడు. తనతో శారీరక సంబంధం అనుభవిస్తూ తన కుమార్తె వరుసయ్యే పవిత్రనిచ్చి పెళ్లి చేసేది లేదని తెగేసి చెప్పింది. దీంతో వారిమధ్య ఘర్షణ జరగడంతో చిన్నరాజ్‌ను దూరంగా పెట్టసాగింది. 
 
అదేసమయంలో పవిత్రకు పెళ్లి సంబంధాలు చూడటం ప్రారంభించింది. ఈ విషయం చిన్నరాజ్‌కు తెలిసింది. ఈనెల 20వ తేదీన ఇంటికి వచ్చిన చిన్నరాజ్.. ఆ రాత్రి పాండియమ్మాళ్‌ ఇంట్లోనే ఉన్నాడు. అర్థరాత్రి సమయంలో ఆమెతో గొడవపడ్డాడు. ఆ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన చిన్నరాజ్.. పక్కనే ఉన్న ఇనుపరాడ్‌ను తీసుకుని తలపై కొట్టడమే ఆమె చనిపోయింది. దీన్ని చూసిన ముగ్గురు కుమార్తె కేకలు వేయడంతో వారిని కూడా ఇనుపరాడ్‌తో కొట్టి చంపేశాడు. ఆ రాత్రంతా శవాలతోనే ఉన్న చిన్నరాజ్.. మరుసటిరోజు ఉదయం ఇంటికి తాళం వేసి పారిపోయాడు. 
 
అయితే, నాలుగు రోజుల తర్వాత అంటే శుక్రవారం ఇంటి నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు వచ్చి చూడగా, ఇంట్లో నాలుగు మృతదేహాలు కళ్ళిపోయిన స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.