మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 22 జనవరి 2019 (14:57 IST)

ఆస్తిని ప్రియురాలికి రాస్తాడనీ... కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్త హత్య

అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భర్త తనను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పైగా, ఆమెతోనే ఎక్కువగా ఉండసాగాడు. దీంతో ఆస్తి మొత్తాన్ని ఆమె పేరుమీదరాస్తాడన్న సందేహం ఉత్పన్నమైంది. ఈ అనుమానం కాస్త పెనుభూతమైంది. అంతే.. కాంట్రాక్టు కిల్లర్లతో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి పడేశారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన జోగీందర్ అనే వ్యక్తి స్వీటి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. అయితే, పెళ్ళికి ముందు నుంచే తన భర్తకు వివాహేతర సంబంధం ఉండేదని భార్య అనుమానిస్తూ ఉండేది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో ఆస్తి మొత్తాన్ని సదరు మహిళకే ఇచ్చేస్తాడని భయపడిన ఆమె కాంట్రాక్ట్ కిల్లర్లతో బెదిరించాలని ప్లాన్ చేసింది. 
 
ఇందుకోసం రూ.16 లక్షలకు సుపారీ మాట్లాడుకుంది. ముందుగా రూ.2.5 లక్షలు చెల్లించింది. అయితే, కాంట్రాక్టు కిల్లర్లు మాత్రం ఏకంగా జోగీందర్‌ను హతమార్చారు. ఈ హత్య ఈనెల 17వ తేదీన జరుగగా, మృతదేహాన్ని ఓ గోనె సంచిలో మూటగట్టి, ఎవరికీ తెలియని ప్రదేశంలో పడేశారు.
 
ఈ నేపథ్యంలో తన సోదరుడు కనిపించకపోవడంతో జోగీందర్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేసమయంలో బజ్‌గేరా ప్రాంతంలో ఓ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చనిపోయిందని జోగీందరే అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... తమదైనశైలిలో విచారణ జరిపారు. ఈ విచారణలో అసలు విషయాన్ని వెల్లడించారు. దీంతో స్వీటిని అరెస్టు చేయగా, కాంట్రాక్టు కిల్లర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.