శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Chitra
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (09:45 IST)

కన్నతండ్రి కన్యత్వాన్ని చెరిపేస్తే.. అన్నయ్య మృగంలా మారాడు.. ఆ మహిళను మగాళ్లంతా రేప్ చేశారు!

కన్నతండ్రి కన్యత్వాన్ని చెరిపేస్తే.. తోడబుట్టిన అన్నయ్య మృగంలా ప్రవర్తించాడు. అంతేనా.. ఆ ఇంట్లోని మగాళ్ళంతా కామాంధులుగా మారి.. ఆమె శీలాన్ని చెరిపేశారు.

కన్నతండ్రి కన్యత్వాన్ని చెరిపేస్తే.. తోడబుట్టిన అన్నయ్య మృగంలా ప్రవర్తించాడు. అంతేనా.. ఆ ఇంట్లోని మగాళ్ళంతా కామాంధులుగా మారి.. ఆమె శీలాన్ని చెరిపేశారు. ఏ మానవ మృగం ఫలితమే ఓమో గానీ.. ప్రస్తుతం ఆమె కడుపులో పెరుగుతున్న పిండం.. ఆమెకు గండంలా మారింది. ఇలాంటి దారుణ పరిస్థితి 42 యేళ్ళ మహిళకు జరిగింది. ఆ మహిళ పేరు యన్ యంగ్. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఆ మహిళ వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు. ఆమె పసితనం నుంచి పాతికేళ్లు వచ్చే దాకా ఎన్నో దారుణాలను చవిచూసింది. కన్నతండ్రి కన్యత్వాన్ని చెరిపేస్తుంటే ఆ ప్రాణం అమాయకంగా ఊరుకుంది. తొమ్మిదేళ్ల వయసులో తోడబుట్టిన అన్నయ్యే మృగంలా మీద పడితే ఏం జరుగుతుందో తెలియని మౌన స్థితిలో దీనురాలిగా నిలుచుండిపోయింది. సొంతింట్లో రక్షణ లేదని భావించి సమాజాన్ని ఆశ్రయించింది. 
 
ఆమె పరిస్థితిని చూసిన ఓ వ్యక్తి ఆదుకుంటానని ముందుకు వచ్చాడు. మంచోడే కదా అని నమ్మింది కానీ అతనూ ఓ కామాంధుడేనని గుర్తించలేక పోయింది. ఆ మానవ మృగం కూడా మీదపడి కోరిక తీర్చుకుందే తప్ప నిలువ నీడనివ్వలేదు. 25 ఏళ్ల వయసులో కామాంధుడి కోరికకు బలైన ఆమెకు కడుపులో పిండం మరో గండంగా మారింది. 
 
ఈ కామాంధుల దుర్మార్గం ఫలితంగా ఆమె మానసిక వికలాంగురాలిగా మారింది. తనకు ఇప్పుడు 42 సంవత్సరాలు. తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి తెలియజేసింది. మనుషుల్లా వేషం వేసుకుని సమాజంలో తిరుగుతున్న మానవ మృగాలు ఎన్నో ఉన్నాయని, తన జీవితానికి మించిన ఉదాహరణ ఉండదని ఆవేదనను వ్యక్తం చేసింది.