శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 జులై 2017 (09:13 IST)

ఉద్యోగ ఇంటర్వ్యూకు పిలిచారు.. గదిలో బంధించి గ్యాంగ్ రేప్ చేశారు...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. ఉద్యోగ ఇంటర్వ్యూకు పిలిచిన నలుగురు కామాంధులు... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ రేప్ వివరాలను పరిశీలిస్తే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాంగ్ రేప్ జరిగింది. ఉద్యోగ ఇంటర్వ్యూకు పిలిచిన నలుగురు కామాంధులు... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ గ్యాంగ్ రేప్ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షహరన్‌పూర్ జిల్లా జదోడా గ్రామానికి చెందిన 20 ఏళ్ల అమ్మాయి ఉద్యోగ వేటలో నిమగ్నమైంది. దీన్ని గుర్తించిన అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు ఉద్యోగం ఇస్తామని ఆశచూశారు. 
 
తమ వద్ద ఉద్యోగం ఉందని చెప్పి ఇంటర్వ్యూకు రావాల్సిందిగా కబురు పంపారు. ఆ తర్వాత గ్రామ శివార్లలో ఉన్న ఓ గృహానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ కామాంధుల నుంచి తప్పించుకుని వచ్చిన బాధిత యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కామాంధుల కోసం గాలిస్తున్నారు. గ్యాంగ్ రేప్ చేసిన వారిలో జదోడా గ్రామానికి చెందిన అనిల్, రాజీవ్‌లున్నారని జిల్లా ఎస్పీ ప్రబాల్ ప్రతాప్ సింగ్ చెప్పారు.