శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 20 జనవరి 2018 (19:19 IST)

భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు.. భవనం నుంచి తోసేశాడు.. ఎక్కడ?

ట్రిపుల్ తలాక్ బిల్లు అని పిలిచే ముస్లిం మహిళల (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండానే సభ ఆమోదం పొందింది. అయితే ఉత్తరప్రదేశ

ట్రిపుల్ తలాక్ బిల్లు అని పిలిచే ముస్లిం మహిళల (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ బిల్లు ఎలాంటి సవరణలు లేకుండానే సభ ఆమోదం పొందింది. అయితే ఉత్తరప్రదేశ్‌లో ట్రిపుల్ తలాక్ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్‌ తలాక్ చెప్పాడు. అంతటితో ఆగకుండా భవనంపై నుంచి తోసేశాడు.
 
ప్రస్తుతం బాధితురాలు మహిళకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. బాధితురాలు ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి ఎముకలు విరిగిపోయానని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గర్ముక్తేశ్వర్‌ ఆలయ ప్రాంతంలో చోటు చేసుకుందని, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
 
కతౌలికి చెందిన బాధితురాలు నర్గీస్ పర్వీన్.. శామ్ మొహమ్మద్‌మను ఐదేళ్ల క్రితం వివాహం చేసుకుందని.. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఓ అబ్బాయి వున్నారని.. వీరు మైనర్లని పోలీసులు చెప్పారు. అయితే మొహమ్మద్ పర్వీన్‌ను అదనంగా రూ.3లక్షల రూపాయలను కట్నంగా తెమ్మని  గొడవకు దిగాడు. అందుకు నర్గీస్ కుదరదని చెప్పడంతో కోపావేశానికి గురైన మొహమ్మద్.. ఆమెకు తాత్కాలికంగా తలాక్ చెప్పి.. ఇంటి భవనం నుంచి కిందికి తోసేశాడని పోలీసులు చెప్పారు.