మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: బుధవారం, 28 జనవరి 2015 (08:12 IST)

తల్లీ.. పిల్లలు అందర్నీ.. ఊచకోత. ఐదుగురిని చంపి...ఆపై పోలీసులకు సమాచారమిచ్చి.

కసాయి హత్యలంటే ఎలా ఉంటాయో చేసి చూపారు కిరాతకులు... గొర్రెలను, పొట్టేళ్ళను కోసినట్లుగా ఇంట్లో ఎందరున్నారో అందరినీ గొంతు కోసి హత్య చేశారు. చివరకు 8 యేళ్లు, ఆరేళ్ళ పిల్లలను కూడా దుండగులు వదిలి పెట్టలేదు. వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే సంబరంగా చూసుకున్నారు. తీరిగ్గా పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పి పరారయ్యారు. దారుణ సంఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ నగరంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. 
 
రుక్సానా అనే మహిళ తన పిల్లలు రిన్షా (20), జూలీ (8), గూంగీ (6), సుహాల్  (12)తో కలసి మీరట్ నగరంలోని సుహాల్ గార్డెన్లో ఓ ఇంట్లో కాపురముంటోంది. అయితే ఓ హత్య కేసులో రుక్సానా భర్త ఇప్పటికే జైలులో ఉన్నారు. సోమవారం కొందరు దుండగలు రుక్సానా ఇంట్లో ప్రవేశించారు. పిల్లలతో సహా ఉన్న రుక్సానాపై దుండగులు విరుచుకుపడ్డారు. రుక్సానాను, ఆమె పిల్లలను పదునైన కత్తితో గొర్రెలను కోసినట్లు గొంతు కోసేశారు. చివరకు ఎనిమిదేళ్ళ జూలీ, ఆరేళ్ల గూంగీని కూడా విడిచి పెట్టలేదు. ఇంట్లోనే ఉన్న మరో గుర్తు తెలియని వ్యక్తిని కూడా చంపేశారు. 
 
ఆపై పోలీసులకు ఫోన్ చేసి ఐదు మంది రక్తపు మడుగులో పడి ఉన్నారని సమాచారమిచ్చారు. దీంతో  నివాసానికి చేరుకుని పోలీసులు మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం ఎవరిదో గుర్తించవలసి ఉందని తెలిపారు. మృతుల గొంతుకలను మాత్రం బాగా పదునైన ఆయుధాలతో కొసి వేశారని పోలీసులు వెల్లడించారు. అయితే భర్తకు శత్రువులుగా ఉన్నవారు చంపారా? లేక మరేదైనా కోణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.