మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 29 జులై 2015 (21:26 IST)

యాకూబ్ ఏం చేస్తున్నాడు..? మధ్యాహ్నం భోజనం చేశాడా..?

యాకూబ్ మెమన్.... ముంబయి పేలుళ్ళ కేసులో ముద్దాయి. గురువారం తెల్లవారితే ఉరి తీస్తారు. ఆయన ప్రస్తుతం నాగ్‌పూర్ జైళ్ళో చాలా టెన్షన్ టెన్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు విచారణ గురించి పదే పదే విచారిస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు.
 
రేపు ఉదయం ఏడు గంటలకల్లా ఉరికంబం ఎక్కనున్న యాకుబ్ మెమన్ ఈ మధ్యాహ్నం నుంచి ఏమీ తినడం లేదు. తీర్పు ఏమని వచ్చిందో తెలుసుకునేందుకు మాటిమాటికీ నాగ్‌పూర్ జైలు గార్డులను అడుగుతున్నాడు. 
 
రాష్ట్రపతి నిర్ణయం గురించి, కేంద్ర హోంశాఖ నిర్ణయం గురించి అడుగుతున్నాడు. మరోవైపు అధికారులు జైలు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.