గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (16:14 IST)

హాట్ టాపిక్: ఈసారి తమిళనాట డీఎంకేదే విజయం.. దెయ్యాల జోస్యం

సాధారణంగా గణాంకాలు, సర్వేలు కొన్ని సంస్థలు కంప్యూటర్లు, లేదా అధికారులతో నిర్వహిస్తుంటాయి. అయితే కొత్త ఆత్మలు కూడా ఎన్నికల్లో ఎవరిది విజయమనే విషయాన్ని వెల్లడించేస్తున్నాయి. అలాంటి ఘటనే ప్రస్తుతం తమిళనాట చోటుచేసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని సర్వత్రా చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మల వద్ద చేపట్టిన సర్వేలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేనే అధికార పగ్గాలు చేపడుతుందని తేలింది. ఇదెలాగంటే.. ఆత్మలో సంభాషించే రమణి అనే వ్యక్తి ఈ సర్వేను నిర్వహించారు. 
 
తమిళనాడులో నాగై జిల్లా మయిలాడుదురైకు చెందిన వ్యక్తి రమణి. ఈ ప్రాంతంలో జ్యోతిష్యం, పూనకం వచ్చి ఆడటంతో రమణి దిట్ట. అంతేకాదు.. అప్పుడప్పుడు ఇతడు ఆత్మలతో కూడా మాట్లాడుతాడని స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై నిర్వహించిన ఆత్మల గణాంకాల్లో.. ఆత్మలన్నీ డీఏంకేకే ఓటేశాయి. ఈ తతంగమంతా వీడియో రూపంలో వెల్లడైంది. మాజీ ముఖ్యమంత్రి అన్నాడీఎంకే చీఫ్ ఎం.జి. రామచంద్రన్ ఆత్మ కూడా డీఎంకేనే ఈ దఫా గెలుస్తుందని పేర్కొనడం హాస్యాస్పదం.