బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2017 (14:42 IST)

మోదీ జీ... మీరే మా నాన్నను కాపాడాలి... ఓ బాలిక ఉత్తరం

చావుబతుకులతో పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలంటూ ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెనువెంటనే స్పందించారు. బాలిక తండ్రికి తగిన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వ

చావుబతుకులతో పోరాడుతున్న తన తండ్రిని కాపాడాలంటూ ఓ బాలిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. ఈ లేఖపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వెనువెంటనే స్పందించారు. బాలిక తండ్రికి తగిన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహ్రానాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిని అతడిని ఆసుపత్రిలో చూపించి మందులు వాడారు. 
 
చేతిలో డబ్బు లేకపోవడంతో బాధితుడిని ఇంటికి తీసుకువచ్చారు. ఇంటికి వచ్చాక మందులు వాడకపోవడంతో అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. దీనితో అతడి కుమార్తె ఇషు కుమారి తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయాన్ని అర్థిస్తూ ఓ ఉత్తరం రాసింది. 
 
ఈ ఉత్తరాన్ని, ఆమెను ఓ వ్యక్తి ఫోటో తీసి మైక్రో బ్లాగింగ్ సైట్లలో పోస్టు చేశాడు. ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ దృష్టికి రావడంతో వెంటనే బాలిక ఉత్తరంపై స్పందించి, ఆమె తండ్రికి వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.