శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 25 జనవరి 2017 (05:25 IST)

జాతీయ పార్టీల ఆదాయ వృద్ధి 313 శాతం.. ప్రాంతీయ పార్టీల ఆదాయ వృద్ధి 652 శాతం

ఒక దశాబ్దంలో జాతీయ పార్టీలకు గుర్తు తెలీని వర్గాల నుంచి వచ్చిన ఆదాయం 313 శాతం పెరిగిందని అదే ప్రాంతీయ పార్టీలకు గుర్తు తెలీని వర్గాల నుంచి వచ్చిన ఆదాయం 652 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది. బీఎస్పీ పార్టీకి అయితే నూటికి నూరు శాతం ఆదాయం తెలియని వనరుల

దేశంలోని జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం 2004-05 2014-15 మధ్యకాలంలో రూ. 11,367 కోట్లకు పెరిగిందని ప్రజాస్వామిక సంస్కరణల సమితి విశ్లేషణ పేర్కొంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీదే సింహభాగమని తేలింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజకీయ పార్టీలకు వచ్చిన ఆదాయంలో 69 శాతం వరకు గుర్తుతెలీని వర్గాల నుంచే వచ్చింది.

ఒక దశాబ్దంలో జాతీయ పార్టీలకు గుర్తు తెలీని వర్గాల నుంచి వచ్చిన ఆదాయం 313 శాతం పెరిగిందని అదే ప్రాంతీయ పార్టీలకు గుర్తు తెలీని వర్గాల నుంచి వచ్చిన ఆదాయం 652 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది. బీఎస్పీ పార్టీకి అయితే నూటికి నూరు శాతం ఆదాయం తెలియని వనరుల నుంచే వచ్చంది. ఇదంతా గుర్తు తెలియని వర్గాలు విరాళాల రూపంలోనే వచ్చిందని తెలిసింది. 2004-05 సంవత్సరంలో 5. 19 కోట్ల రూపాయలకుగా ఉన్న బీఎస్పీ ఆదాయం 2014-15 నాటికి రూ. 111.96 కోట్లకు చేరింది. 
 
దేశంలోని ఆరు జాతీయ పార్టీల మొత్తం ఆదాయంలో 43 శాతం కాంగ్రెస్‌ది కాగా, బీజేపీ రూ. 3,272 కోట్లతో  రెండోస్థానంలో నిలిచింది. కాగా సీపీఎం రూ. 893 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఆదాయంలో 83 శాతం (రూ. 3,372.63 కోట్లు), బీజేపీ పార్టీ ఆదాయంలో 65 శాతం (రూ.2,125.91 కోట్లు) గుర్తు తెలియని వర్గాల నుంచి వచ్చిందేనని ఈ అధ్యయనం తెలిపింది.
 
దేశంలోని 51 ప్రాంతీయ పార్టీల్లో 42 పార్టీల ఆదాయ పన్ను రిటర్నులు అందుబాటులో లేవని ఎడీఆర్ తెలిపింది. భూటాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, బల్గేరియా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో రాజకీయ పార్టీలకు వస్తున్న ఆదాయంలో 75 శాతం వరకు తెలిసిన వనరుల నుంచే రాగా, ఇండియాలో దానికి పూర్తి రివర్సులో జరుగుతోందని ఈ నివేదిక తెలిపింది.