శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By selvi
Last Modified: సోమవారం, 11 సెప్టెంబరు 2017 (21:53 IST)

నవరాత్రుల్లో ఏడవరోజు.. కాళరాత్రిని పూజిస్తే..(వీడియో)

నవరాత్రుల్లో ఏడవ రోజున (సెప్టెంబర్ 27) కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజి

నవరాత్రుల్లో ఏడవ రోజున (సెప్టెంబర్ 27) కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజించడం ద్వారా భక్తులు ఆపదలు, అరిష్టాల నుంచి బయటపడతారు. 
 
ఈ రోజున సరస్వతీ దేవిని ఆవాహనం చేసుకోవాలి. మూల నక్షత్ర ఆవాహన ముహూర్తం నిడివి రెండు గంటల 22 నిమిషాలు. ముహూర్తం 3.45 నుంచి 06.07 గంటల వరకు. ఈ రోజు నుంచి సరస్వతీ పూజ ప్రారంభం అవుతుంది. 
 
ఈ రోజున కాళరాత్రిని ఈ క్రింది మంత్రముతో స్తుతిస్తే.. దారిద్ర్య ఈతిబాధలు తొలగిపోతాయి. కాళరాత్రి అమ్మవారి మంత్రము...
"ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా 
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరణీ 
వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా 
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ"