దుర్గాదేవికి మల్లెలు, జాజులు అంటే..?
దుర్గాదేవికి మల్లెలు, జాజులు, సంపెంగలు అంటే మహాప్రీతి. అలాగే 'పున్నాగులు' .. 'గన్నేరులు' .. 'కలువలు' .. 'తామరలు' .. 'తుమ్మిపూలు' కనిపిస్తూ ఉంటాయి. ఈ పూలతో దుర్గాదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
ఇలా అమ్మవారికి ఇష్టమైన పూలతో అర్చించడం వలన పుణ్యరాశి పెరుగుతుందనీ, మనోభీష్టాలు నెరవేరతాయని పండితులు అంటున్నారు. దీర్ఘసుమంగళీ ప్రాప్తం కోసం, నచ్చిన వరుడితో వివాహం జరగాలని ఆశించేవారు.. దుర్గాదేవిని మల్లెలతో లేదా సంపెంగలతో పూజించాలి.