శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : గురువారం, 10 జులై 2014 (18:57 IST)

పాదరసం వినాయకుడిని పూజిస్తే.. ఆర్థిక లోటు ఉండదట!

పాదరస గణపతిని పూజా మందిరంలో ప్రతిష్టించుకుని పూజించేవారి ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని పురోహితులు అంటున్నారు. సాధారణంగా పాదరసం అంటే చైతన్యానికి ప్రతీక. పాదరస గణపతి మహా శక్తివంతమైంది. పాదరస గణపతి అమూల్యమైంది, అద్భుతమైంది. ఈ పాదరస గణపతిని పూజించడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందంటే.. 
 
* పాదరస గణపతిని అర్చించేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.
 
* పాదరస గణపతిని పూజించడం ద్వారా అకాల మృత్యుభయం ఉండదు.
 
* పాదరస గణేశుని ప్రార్థించినట్లయితే అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి.
 
*  పారద విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించేవారికి ఏ సమస్యలూ, చిరాకులూ తలెత్తవు.
 
*  ''ఓం లంబోదరాయ నమః'' అనే మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే అత్యున్నత స్థితికి చేరుకుంటారు.